
శ్రీశైల దేవస్థానం:అక్టోబరు 26వ తేదీ నుండి నవంబరు 23 వరకు శ్రీశైల దేవస్థానం కార్తిక మాసోత్సవాలు జరుగనున్నాయి .కార్తిక మాస ఏర్పాట్లకు సంబంధించి గురువారం పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం జరిపారు.ఈసమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి జి.ఎం. విజయలక్ష్మి సుబ్బరాయుడు, ఓ. మధుసూదన్రెడ్డి, శ్రీమతి బరుగురెడ్డి పద్మజ కూడా పాల్గొన్నారు. ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక (స్థానాచార్యులు) అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి ఎస్. లనవ్న మాట్లాడుతూ కార్తిక మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాలను ఆదేశించారు. ఆయా ఏర్పాట్లన్నీ కూడా ముందస్తుగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణమి, శుద్ధ, బహుళ ఏకాదశులు, కార్తికమాస శివరాత్రి, ప్రభుత్వ సెలవు రోజులలో భక్తులరద్దీ అధికంగా ఉంటుందని చెబుతూ రద్దీకనుగుణంగా ఆయా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేపట్టాలన్నారు. పాతాళగంగవద్ద శౌచలయాలకు, స్త్రీలు దుస్తులు మార్చుకునే గదులకు , పాతాళగంగ మెట్ల మార్గం మొదలైనచోట్ల అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు. గంగాభవానీ స్నాన ఘట్టాలకు కూడా అవసరమైన మరమ్మతులను చేయించాలన్నారు.
ధర్మకర్తల మండలి సభ్యులు విరూపాక్షయ్యస్వామి మాట్లాడుతూ కార్తికమాసంలో భక్తులు దీపాలను వెలిగించుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించాలన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఓ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కార్తిక మాసంలో భక్తి, ఆధ్యాత్మిక సంబంధి అంశాలపై ప్రవచనాలను ఏర్పాటు చేయాలన్నారు.
భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, శ్రీస్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవలు, నవంబరు 8వ తేదీన ( కార్తికపౌర్ణమి) రానున్న చంద్రగ్రహణం రోజున ఆలయ వేళలు, క్యూలైన్ల నిర్వహణ, రద్దీక్రమబద్దీకరణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పారిశుద్ధ్యం, పార్కింగ్, కార్తిక సోమవారాలలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తిక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం , పుణ్యనదీహారతి ఏర్పాట్లు, కార్తికమాసంలో ఆకాశదీపం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మొదలైన అంశాలను గురించి సుదీర్ఘంగా చర్చించారు.సమావేశంలో ఈ క్రింది అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు :
భక్తులకు సేవలు అందించేందుకుగాను కార్తిక మాసంలో రద్దీ రోజులలో కార్యాలయ సిబ్బందికి
ప్రత్యేక విధులు కేటాయిస్తారు.
దర్శనం ఏర్పాట్లు :
వేకువజామున గం.3.00లకు ఆలయద్వారాలు తెరచి, ప్రాత:కాల పూజల అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంకాలం గం. 4.00ల వరకు దర్శనాలు కల్పిస్తారు. తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి రాత్రి గం. 11.00ల వరకు దర్శనాలు కొనసాగుతాయి. కార్తిక మాసంలో సోమవారాలు, ప్రభుత్వ సెలవుదినాలు మొదలైన రద్దీ రోజులలో ( కార్తికమాసం మొత్తం 15 రోజులపాటు) స్వామివార్ల స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేస్తారు. • ఈ రద్దీ రోజులలో భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే వుంటుంది. ఈ రద్దీ రోజులలో సామూహిక అభిషేక సేవాకర్తలకు కూడా అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. రద్దీ రోజులలో గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తారు. • ఉదయాస్తమానసేవ , ప్రదోషకాలసేవాకర్తలకు మాత్రం ఆయా సేవలన్నింటీని జరిపించే
అవకాశం వుంటుంది. ఈ సేవలకు పరిమితంగానే, రోజుకు ఒక్కొక్క సేవకు 6 టికెట్లు మాత్రమే ఇస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్జితసేవలు : • సామూహిక అభిషేకాలు ప్రస్తుతం ఉన్నట్లుగానే మూడు విడతలుగా వుంటాయి. మొదటి
విడత ఉదయం . గం. 6.30 లకు : రెండవ విడత మధ్యాహ్నం గం. 12.30లకు : మూడవ విడత
సాయంత్రం గం.6, 30లకు చేస్తారు. • రద్దీ రోజులలో సాముహిక అభిషేక సేవకర్తలకు కూడా గతంలోవలెనే స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదు.రెండు విడతలుగా ఆర్జిత హోమాలు చేస్తారు. • రద్దీరోజులలో అమ్మవారి అంతరాలయములో జరిపించే కుంకుమార్చనలు, అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో చేస్తారు .
అన్నప్రసాదాల వితరణ :
భక్తులకు అన్నదాన భవనములో ఉదయం 10.30 నిమిషాల నుండి 03.30వరకు అన్నప్రసాదాల
వితరణ చేస్తారు. • సాయంత్రం గం. 6.30ల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేస్తారు.
క్యూ కాంప్లెక్స్ లో దర్శనానికి వేచి ఉండే భక్తులకు మంచి నీరు,బిస్కెట్లు, అల్పాహారం ఇస్తారు . రద్దీ రోజులలో ఉదయం వేళలో క్యూకాంప్లెక్స్ లో వేడిపాలు అందిస్తారు. కార్తికమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేస్తారు. రద్దీకి అనుగుణంగా ప్రసాదాల విక్రయ కేంద్రాలు ఏర్పాటు. ప్రస్తుతం ఉన్న 7 విక్రయ కేంద్రాలతో పాటు అదనంగా మరో 4 కౌంటర్లు ఏర్పాటు చేస్తారు.
పాతాళగంగవద్ద ఏర్పాట్లు:
కార్తిక మాసములో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా పాతాళగంగ వద్ద
అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు. పాతాళగంగవద్ద శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.అదేవిధంగా అదనపు లైటింగ్ ఏర్పాట్లు చేస్తారు.
కేశఖండనశాలలో ఏర్పాట్లు:
- భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కే శఖండనశాలలో ఆయా ఏర్పాట్లు చేస్తారు.
- ముఖ్యంగా భక్తుల రద్దీకనుగుణంగా కేశఖండనశాల వేళలను నిర్ధారిస్తారు.
- సూచిక బోర్డుల ఏర్పాట్లు :
భక్తులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా మరిన్ని సూచికబోర్డులు ఏర్పాటు చేస్తారు.
కార్తిక మాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు :
లోకకల్యాణం కోసం గతంలో లాగే ఈ సంవత్సరం కూడా కార్తి కమాసంలో అఖండ శివచతుస్సప్తాహ భజన కార్యక్రమ నిర్వహణ.
పుష్కరిణి వద్ద లక్షదీపార్చన:
పుష్కరిణి హారతి, కార్తిక సోమవారాలలో పుష్కరిణి ” వద్ద లక్షదీపోత్సవం , పుష్కరిణి హారతి కార్యక్రమాలు వుంటాయి. కార్తికదీపోత్సవం:
• భక్తులు కార్తిక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడ వీధీ (శివవీధి),
గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు పుణ్యనదీ హారతి • కార్తిక పౌర్ణమి నవంబరు 8వ తేదీ అయినప్పటికీ, ఆ ముందురోజు 7వ తేదీ – మూడవ సోమవారం రోజుననే ప్రదోషకాలంలో పౌర్ణమి ఘడియలు వస్తాయి..
అందుకే 7వతేదీ సాయంకాలానే కృష్ణవేణినదీమతల్లికి పుణ్యనదీహారతి కార్యక్రమం వుంటుంది.
ఈ సందర్భంగా పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణీ విగ్రహానికి పూజాదికాలు, సారె సమర్పణ చేస్తారు. • అదేవిధంగా జ్వాలాతోరణ కార్యక్రమం కూడా 7వ తేదీ సాయంకాలాన నిర్వహిస్తారు.
సాంస్కృతిక కార్యక్రమాలు:
ఆలయ నిత్యకళావేదిక వద్ద ప్రతిరోజు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయి.
లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి రోజులలో పుష్కరిణి వద్ద ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు
వుంటాయి.
చంద్రగ్రహణం:
నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం గం.6.00ల నుంచి సాయంత్రం గం.6.30ల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఆ రోజున అన్ని ఆర్జిత, శాశ్వత, పరోక్షసేవలు నిలుపుదల చేస్తారు.