హైదరాబాద్: జర్నలిస్ట్ కె ఎల్ రెడ్డి మెమోరియల్ అవార్డు ఇవ్వటానికి నిర్ణయం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం మేరకు గతంలో 15 లక్షల రూపాయలు జర్నలిస్టు కే ఎల్ రెడ్డి సంరక్ష ణార్థం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పట్లో ఆశ్రమంలో ఉన్న కేల్ రెడ్డి బాగోగులు, వైద్య చికిత్సకు ఈ డబ్బును ఉపయోగించుకోవాలని సూచించారు. కానీ కె.ఎల్ రెడ్డి నవంబర్ 3, 2022 న పరమపదించారు.
కెఎల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన పేరున ఒక మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ప్రభుత్వం ఇచ్చిన 15 లక్షలలో తొమ్మిది లక్షలు మీడియా అకాడమీకి ఇచ్చి, దానిపై వచ్చిన వడ్డీతో, ప్రతి సంవత్సరం “కె ఎల్ రెడ్డి మెమోరియల్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ” ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 3న ఇచ్చే ఈ అవార్డు గ్రహీత ఎంపికకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. అకాడమీ అధ్యక్షులు చైర్మన్ గా ఉండే ఈ కమిటీలో, ఇద్దరు ప్రముఖ జర్నలిస్ట్ లు, కె ఎల్ రెడ్డి కుటుంబం నుండి ఇద్దరు, అకాడమీ కార్యదర్శి, సభ్యులుగా ఉండి, అవార్డు గ్రహీతను నిర్ణయిస్తారని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలియజేసారు.
మీడియా అకాడమీలో ….
సోమవారం కె ఎల్ రెడ్డి అల్లుడు లింగారెడ్డి, అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు ఒప్పంద పత్రాలను, అకాడమీ చైర్మన్, కె ఎల్ రెడ్డి తమ్ముడు ఇంద్రసేనారెడ్డి సమక్షంలో మార్చుకున్నారు.
