ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనాలు అందాయి. ఆలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం సీ ఎం ను కలిసి జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.