శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రంలో ఈ నెల 22 నుండి మార్చి 4  వరకు జరిగే  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రముఖులను ఆహ్వానించారు.శుక్రవారం  విజయవాడలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న  రాష్ట్ర గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ , ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి ,  దేవదాయశాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు లను  కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందజేసి, ఉత్సవాలకు ఆహ్వానించారు.దేవదాయశాఖ

ముఖ్యకార్యదర్శి డా.జి.వాణీ మోహన్, దేవదాయ కమిషనర్ డా. ఎం.హరిజవహర్ లాల్ లను కూడా కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు.

కార్యనిర్వహణాధికారి  ఎస్. లవన్న  ఆదేశాల మేరకు ఈ రోజు  స్వామివారి ఉప ప్రధాన అర్చకులు  శివప్రసాద్, ఆలయ పర్యవేక్షకులు రవి కుమార్ తదితరులు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ని  ఉత్సవాలకు ఆహ్వానించారు.

*Inviting of Sameer Sharma , IAS,Chief Secretary Government of AP.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.