శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
సోమవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి , యం. శ్రీనివాసరావు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమం లో గవర్నరుకు వేదాశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటం అందించారు.