శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో సెప్టెంబరు 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
శుక్రవారం మానవ వనరులశాఖ అభివృద్ధి , ఐ.టీ, కమ్యూనికేషన్లశాఖ మంత్రి నారా లోకేశ్ కు ఆహ్వాన ప
త్రికను అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు.శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేదపండితులు మంత్రిని కలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు.
సచివాలయములో దేవదాయశాఖ కార్యదర్శి డా. యం.హరిజవహర్లాల్ కు ఆహ్వాన పత్రికను అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేదపండితులు కార్యదర్శి కలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా వేదాశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలను అందించారు.
