
శ్రీశైల దేవస్థానం: ఏ చిన్నపనిలో కూడా నాణ్యతపరంగా రాజీ పడకూడదని ఈ ఓ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో దేవస్థానం నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహాల నిర్మాణ పనులను సోమవారం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ నిర్మాణానికి సంబంధించిన పనులన్నింటిన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.ముఖ్యంగా వసతిగృహాల వద్ద సీ. సీరోడ్లు, మురుగు నీటి వ్యవస్థ సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి హెచ్. టి. యార్డు పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.
సిబ్బంది వసతిగృహాలకు మంచినీటి సరఫరాకు నిర్మాణంలో ఉన్న నీటిసంపుల పనులను మరింత వేగవంతం చేసి, వాటికి అవసరమైన మోటార్లను కూడా ఏర్పాటు చేసే పనులను త్వరితగతిన పూర్తి కావాలన్నారు ఈ ఓ. నిర్మాణంలో పూర్తిగా నాణ్యత ప్రమాణాలను పాటించాలని చెప్పారు.
ఫిబ్రవరి చివరి వారానికంతా అన్ని పనులను పూర్తి చేయాలని సూచించారు.
మొత్తం 3 నమూనాలలో అనగా 1 – బి.హెచ్. కె. స్మాల్, 1 – బి.హెచ్. కె. బిగ్ , 2 – బి.హెచ్.కె బిగ్ పేర్లతో వీటిని దేవస్థానం నిర్మాణం చేపట్టింది.
1 – బి.హెచ్.కె స్మాల్ లో 108 గృహాలు, 1 – బి. హెచ్. కె. బిగ్ లో 108 గృహాలు, 2 బిహెచ్
కెలో 81 గృహాలుగా మొత్తం 297 గృహాలు నిర్మించనున్నారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం.నరసింహారెడ్డి, ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి.చంద్రశేఖరశాస్త్రి, పి.వి.సుబ్బారెడ్డి, సంబంధిత సహాయ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు