×

మార్చి నెలాఖరులోగా గణేశ సదన పనులన్నీ పూర్తి చేయాలి – ఈ ఓ 

మార్చి నెలాఖరులోగా గణేశ సదన పనులన్నీ పూర్తి చేయాలి – ఈ ఓ 

 శ్రీశైల దేవస్థానం: మార్చి నెలాఖరులోగా గణేశ సదన పనులన్నీ పూర్తి చేయాలని ఈ ఓ  ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఎస్.లవన్న  బుధవారం గణేశసదనము నిర్మాణాన్ని పరిశీలించారు.

టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం 224 గదుల సముదాయంగా గణేశ సదనము నిర్మాణ మవుతోంది.మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్న ఈ సముదాయంలో ఎ బ్లాక్ లో  56 గదులు, బి బ్లాకులో 56 గదులు, సి బ్లాకులో 48 గదులు, డి బ్లాకులో 64 గదులు ఏర్పాటు వుంటుంది.

  మార్చి నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఈ ఓ  ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. సముదాయ ప్రాంగణం నాలుగువైపులా సీసీ రోడ్డు వేయాలని సూచించారు.  కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ తరువాత హెచ్ టి. యార్డు కూడా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.వసతి సముదాయ ప్రాంగణానికి సమీపంలోనే వీలైనంత మేరకు పార్కింగ్ ప్రదేశాన్ని కూడా అభివృద్ధి చేయాలన్నారు. సముదాయ ప్రాంగణమంతా కూడా పచ్చదనం పెంపొందే విధంగా ల్యాండ్ స్కేపింగ్ పనులు కూడా చేపట్టాలన్నారు.

ఈ ఓ నక్షత్రవనాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా నక్షత్రవనాన్ని కూడా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు భాస్కర్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహరెడ్డి, ఎఈలు భవన్ ,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed