స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు హెచ్ఐసీసీలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదట సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగుర వేసి, జెండా వందనం చేశారు. ఆ తర్వాత భరతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలవేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.