శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 4,08,66,617/నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 27 రోజులలో (11.08.2022 నుండి 06.09.2022 వరకు) సమర్పించారన్నారు.ఈ నగదుతో పాటు 335 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం , 8కేజీల 400 గ్రాముల వెండి లభించాయని తెలిపారు.
యుఎస్ఏ డాలర్లు – 378, కెనడా డాలర్లు – 50, ఇంగ్లాండు రౌండ్స్ – 105, ఆస్ట్రేలియా డాలర్లు – 70, యుఏఈ దిర్హమ్స్ – 70, మలేషియా రింగిట్స్ – 2, కత్తార్ రియాల్స్ – 3 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.