హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,68,22,723/– నగదు రాబడి-ఈ ఓ లవన్న

 శ్రీశైల దేవస్థానం:గురువారం జరిగిన  హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,68,22,723/– నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 35 రోజులలో (06.07.2022 నుండి 11.08.2022 వరకు) సమర్పించారన్నారు.ఈ నగదుతో పాటు 184 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బంగారు, 5 కేజీల 860 గ్రాముల వెండి లభించాయన్నారు.

యుఎస్ఎ డాలర్లు – 1113, ఇంగ్లాండు పౌండ్స్ 440, కత్తార్ రియాల్స్ 120, సింగపూర్ డాలర్లు 12, ఓమన్ బైసా 400, ఆస్ట్రేలియా డాలర్లు 80, కువైట్ దిర్హమ్స్ 20, యుఏఈ దిర్హమ్స్ 5, కెనడా డాలర్లు 5, మలేసియా రింగిట్స్ 5, పిలిపినాస్ పిసో 100 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని ఈ ఓ తెలిపారు.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపునుచేపట్టారు. దేవస్తాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది,  శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారని ఈ ఓ వివరించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.