శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,11,94,935/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 13 రోజులలో (09.02.2023 నుండి 21.02.2023 వరకు) సమర్పించారని ఈ ఓ వివరించారు.ఈ నగదుతో పాటు 100 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 6 కేజీల 500 గ్రాముల వెండి లభించాయన్నారు.
అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు – 249, సింగపూర్ డాలర్లు -50, ఆస్ట్రేలియా డాలర్లు – 20, కెనెడా డాలర్లు – 10, కువైట్ దినార్స్ -5 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని ఈ ఓ వివరించారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టామని తెల్పారు. ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.