
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.2,67,88,598/- నగదు
రాబడిగా లభించిందని ఈ ఓ లవన్న తెలిపారు.గురువారం జరిగిన ఈ లెక్కింపులో వివరాలు ఇవి.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 23 రోజులలో ( 17.01.2023 నుండి 8.02.2023 వరకు) సమర్పించారు.
ఈ నగదుతో పాటు 301 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 6 కేజీల 500 గ్రాముల వెండి లభించాయి.
యుఎస్ఏ డాలర్లు – 1,517 ఇంగ్లాండు పౌండ్స్ – 25, ఆస్ట్రేలియా డాలర్లు – 50, కెనడా డార్లు – 20, సింగపూర్ డాలర్లు – 4 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేసారు. ఈ హుండీల లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.