హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,85,45,858/- నగదు రాబడి:ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:మంగళవారం  జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,85,45,858/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 26 రోజులలో (24.11.2022 నుండి 19.12.2022 వరకు) సమర్పించారని ఈ ఓ వివరించారు.ఈ నగదుతో పాటు 240 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 9 కేజీల 580 గ్రాముల వెండి లభించాయని చెప్పారు.

యుఎస్ఏ డాలర్లు – 3,524, యుఏఈ దిర్హమ్స్ – 140, సింగపూర్ డాలర్లు – 75, యూరో – 10, ఓమన్ బైసా – 280 ఓమన్ రియాల్స్ – 10, కెనడా డార్లు – 45, న్యూజిలాండ్ డాలర్లు – 50, కెన్యా డాలర్లు -5000 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని ఈ ఓ చెప్పారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.