శ్రీశైల దేవస్థానం:సోమవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,72,50,251/- నగదు రాబడిగా లభించిందని, భ క్తులు గత 21 రోజులలో ( 22.12.2025 నుండి 11.01.2026 వరకు) ఈ మొత్తం సమర్పించారని ఈ ఓ తెలిపారు. వివరాలు ఇవి.
ఈ హుండీలో 158 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారు, 11 కేజీల 460 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా 1570 – యుఎస్ఏ డాలర్లు, 180 – యు.ఎ.ఇ దిర్హమ్స్, 1- కువైట్ దినార్, 5 – సౌదీరియాల్స్, 17 – సింగపూర్ డాలర్లు, 10 – కెనడా డాలర్లు, 65 – ఇంగ్లాండు ఫౌండ్స్ , 11 – మలేషియా రింగిట్స్, 12510 – ఓమన్ బైసా, 50 – ఆస్ట్రేలియా డాలర్లు, 8 – ఈరోస్, 5 – ఐర్లాండ్, 1500 – మయన్మార్, 10,000 – ప్రాన్స్ , 50 – ఫిలిప్పీన్ , 2000 – వియత్నామ్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.
ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
