శ్రీశైల దేవస్థానం:గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,46,96,431/- నగదు
రాబడిగా లభించిందని దేవస్థానం అధికారి తెలిపారు.
కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 29 రోజులలో (20.08.2025 నుండి 17.09.2025 వరకు) సమర్పించారని పేర్కొన్నారు
హుండీలో 131 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారు, 5 కేజీల 50 గ్రాముల వెండి లభించాయి. విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
లెక్కింపులో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
