
శ్రీశైల దేవస్థానం:మంగళవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,61,42,016/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.వివరాలు ఇవి.
హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో (01.04.2025 నుండి 28.04.2025 వరకు) సమర్పించారు. హుండీలో 105 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారు, 4 కేజీల 860 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా 644 – యుఎస్ఏ డాలర్లు, 50 – సౌది అరేబియా రియాల్స్, 1- కువైట్ దినార్, 115 – యుఏఈ దిర్హమ్స్, 670 – యుకే పౌండ్సు, 54 – సింగపూర్ డాలర్లు, 25 – కెనడా డాలర్లు, 40 – సౌత్ ఆఫ్రికా రాండ్స్ , 5 – ఘనా సీడీస్, 2000 – సెంట్రల్ ఆఫ్రికా ఫ్రాంక్స్, 100 – ఓమన్ బైసా మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిపారు.
ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.