హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 2,18,94,668/- నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: : సోమవారం  జరిగిన   హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల  దేవస్థానానికి రూ. 2,18,94,668/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. హుండీ ఆదాయాన్ని భక్తులు గత 17 రోజులలో ( 31.01.2025 నుండి 16.02.2025 వరకు) సమర్పించారని వివరించారు.

ఈ నగదుతో పాటు 152 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 2కేజీల 150 గ్రాముల వెండి లభించాయన్నారు ఈఓ . అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు 423, మలేషియా రింగిట్స్ – 108, యూకే ఫౌండ్స్ – 20, సింగపూర్ డాలర్లు -10, జింబాబే క్వచ్చాస్ – 120, కెనడా డాలర్లు – 50, సౌదీ అరేబియా రియాల్స్ – 20, థాయిలాండ్ భట్స్ – 20 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని ఈ ఓ తెలిపారు.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగిందని ఈ ఓ తెలిపారు. ఈ కార్యక్రమం లో దేవస్థానం అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.