హుండీల లెక్కింపు ద్వారా  శ్రీశైల దేవస్థానానికి రూ.2,59,68,400/- నగదు రాబడి-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం;శుక్రవారం  జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.2,59,68,400/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.

ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో ( 09.01.2025 నుండి 30.01.2025 వరకు) సమర్పించారని పేర్కొన్నారు. వివరాలు ఇవి.

ఈ నగదుతో పాటు 64 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 3కేజీల 170 గ్రాముల వెండి లభించాయి.

అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు – 590, చైనా యువాన్స్- 100, సౌదీ అరేబియా రియాల్స్ – 5, కువైట్ దినార్సు – 2, కెనడా డాలర్లు – 10, యూఏఈ దిర్హము – 1090, సింగపూర్ డాలర్లు -14, ఖత్తారు రియాల్స్ 1, యూరోప్ 5, మలేషియా రింగిట్స్ – 23, యూకే ఫౌండ్స్ 45, ఆస్ట్రేలియా డాలర్లు – 240, రష్యా రూబెల్స్ -30 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును  జరిగింది.  దేవస్థానం అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.