×

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 4,04,21,906/-లు నగదు రాబడి-ఈ ఓ

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 4,04,21,906/-లు నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 4,04,21,906/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో (09.05.2024 నుండి 05.06.2024 వరకు) సమర్పించారని తెలిపారు. ఈ హుండీలో 332 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 5 కేజీల 760 గ్రాముల వెండి

లభించాయన్నారు.అదేవిధంగా 1768 – యుఎస్ఏ డాలర్లు, 45 – యూఏఈ దిర్హమ్స్, 1- ఖతార్ రియాల్స్, 5 – కెనడా డాలర్స్, 10 – ఈరోస్, 50 – యూ.కె. ఫౌండ్సు, 55 – ఆస్ట్రేలియా డాలర్లు, 1 – మలేషియా రింగిట్స్, 109 – సింగపూరు డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయన్నారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారని వివరించారు.

ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, పలువురు శాఖాధిపతులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు .

print

Post Comment

You May Have Missed