శ్రీశైల దేవస్థానం: శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,87,52,761/- నగదు
రాబడిగా లభించిందని ఈ ఓ అధికారికంగా తెలిపారు. ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 15 రోజులలో ( 28.03.2024 నుండి 11.04.2024 వరకు) సమర్పించారని వివరించారు. ఈ హుండీలో 263 గ్రాముల 900 మిల్లీ గ్రాముల బంగారు, 9 కేజీల 700 గ్రాముల వెండి లభించాయని తెలిపారు.
అదేవిధంగా 44 – యుఎస్ఏ డాలర్లు, 1 – ఒమన్ రియాల్, 101 – ఖత్తార్ రియాల్, 1.75 – కువైట్ దినార్, 5 – – యుఏఈ దిర్హమ్స్ 30 – సౌదీఅరేబియా రియాల్స్, 20 – కెనడా డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని ఈ ఓ తెలిపారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి , అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.