శ్రీశైల దేవస్థానం: గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 1,81,13,485/- నగదు
రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఆలయ హుండీల రాబడిని భక్తులు 12.03.2024 నుండి 27.03.2024 వరకు సమర్పించారని వివరించారు.అదేవిధంగా 178 –యుఎస్ఏ డాలర్లు, 20 – సౌది అరేబియా రియాల్స్, 20 – యు.కె. ఫౌండ్సు, 5 – ఆస్ట్రేలియా డాలర్లు, 100- స్వీడన్ కోనర్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో
లభించాయని తెలిపారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.