
శ్రీశైల దేవస్థానం:శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.3,75,21,688 /- నగదు
రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఆలయ హుండీల ఆదాయాన్ని భక్తులు గత 28 రోజులలో (16.06.2023 నుండి 14.07.2020 వరకు) సమర్పించారన్నారు.హుండీలో 350 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 6 కేజీల 280 గ్రాముల వెండి లభించాయని వివరించారు
అదేవిధంగా 2321 – యుఎస్ఏ డాలర్లు, 100 – ఆస్ట్రేలియా డాలర్లు, 35 కెనడా డాలర్లు, 28 – మలేషియా రింగిట్స్, 15 ఇంగ్లాండు పౌండ్స్, 4- సింగపూర్ డాలర్లు. 40- యూరోప్, 20 – యూ.ఏ.ఈ దిర్హమ్స్, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగిందని ఈ ఓ తెలిపారు.కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీల లెక్కింపులో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారని అధికారికంగా ప్రకటించారు.