హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.2,70,51,419/- నగదు రాబడి-ఈ ఓ లవన్న

 శ్రీశైల దేవస్థానం: శనివారం   జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.2,70,51,419/- నగదు

రాబడిగా లభించిందని ఈ ఓ లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 9 రోజులలో (16.03.2023 నుండి 24.03.2023 వరకు) సమర్పించారన్నారు. యుఎస్ఏ డాలర్లు – 995, సౌదిరియాల్స్ 2, న్యూజిలాండ్ డాలర్లు – 30 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయన్నారు.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టామని ఈ ఓ తెలిపారు.ఈ హుండీల లెక్కింపులో, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది , శివసేవకులు పాల్గొన్నారన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.