
శ్రీశైల దేవస్థానం:గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 2,87,01,092/- నగదు
రాబడిగా లభించిందని ఈ ఓ లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో (22.02.2023 నుండి 15.03.2023 వరకు) సమర్పించారన్నారు.ఈ నగదుతో పాటు 162 గ్రాముల బంగారం, 7 కేజీల 110 గ్రాముల వెండి లభించాయని వివరించారు.అదేవిధంగా యుఎస్ఏ 191, కెనెడా డాలర్లు–110, ఖత్తార్ డాలర్లు-4,
ఇంగ్లాండు డాలర్లు -35, మలేషియా రింగిట్స్ -7 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో
లభించాయన్నారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిగిందని ఈ ఓ వివరించారు.
ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.