×

 శ్రీశైల దేవస్థానం లో ఆత్మీయ సత్కారం

 శ్రీశైల దేవస్థానం లో ఆత్మీయ సత్కారం

 శ్రీశైల దేవస్థానం:దేవస్థానం లో సహాయ కార్యనిర్వహణాధికారి ఎస్. పరుశురామశాస్త్రి,  నైట్వెచ్మెన్   చంద్రశేఖర్ శుక్రవారం  ఉద్యోగ విరమణ చేశారు.

 ఎస్. పరుశురామశాస్త్రి  1990 జూలై నెలలో దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్గా నియామకాన్ని పొందారు. మొత్తం 33 సంవత్సరాలకు పైగా వీరు దేవస్థానంలో విధులను నిర్వహించారు. డి. చంద్రశేఖర్  1985 జూలై నెలలో దేవస్థానములో నియామకాన్ని పొంది మొత్తం 37 సంవత్సరాలుగా  విధులు నిర్వహించారు.

 ఈ సాయంకాలం అమ్మవారి అలయంలోని ఆశీర్వచన మండపంలో నిర్వహించిన ఆత్మీయ సత్కారంలో ముందుగా కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఘనంగా సత్కరించారు. ఆ తరువాత పలువురు దేవస్థానం అధికారులు వారిని సత్కరించారు.

ఈ సత్కారంలో  స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.

 సహాయ కమిషనర్ హెచ్.జి. వెంకటేష్, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, డి.ఇ. (ఐ /సి) మరియు దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు  సుబ్బారెడ్డి, పర్యవేక్షకులు రాధకృష్ణ, సాయికుమారి, గిరిజామణి, శివప్రసాద్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed