
హసిత భాష్పాలు పుస్తక ఆవిష్కరణ సభలో
సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..
- పుస్తక రచయిత శ్రీరామ్ పాలమూరు బిడ్డ కావడం సంతోషం..,
- తెలంగాణ సమాజం కవులకు స్ఫూర్తి ని ఇచ్చిన గడ్డ
- నిజమైన ఉద్యమకారులు ఎవరూ నేను ఉద్యమకారుడిని అని చెప్పుకోరు ..
- అందే శ్రీ ఎప్పుడు నేను ఉద్యమకారుడిని అని చెప్పుకోలేదు
- ఉద్యమకారుడిని అని చెప్పుకున్న వాళ్లకు టీవీ లు,పేపర్లు,వేలకోట్ల ఆస్తులు వచ్చాయి ..
- గూడ అంజయ్య,అందే శ్రీ,గద్దర్,గోరేటి వెంకన్న లాంటి కవులు తెలంగాణ ప్రజల్లో స్పూర్తి నింపారు..
- అందే శ్రీ,గద్దర్ తెలంగాణ ప్రజల స్వేచ్ఛ ను ఆకాంక్షించారు
- నేను ఎవరిని శత్రువు గా చూడను..నేను శత్రువు గా చూడాలంటే వారి కి ఆ స్టాయి ఉండాలి
- 2006 నుంచి ప్రారంభమైన నేను 17 ఏళ్ల లో ముఖ్యమంత్రి అయ్యాను
- తెలంగాణ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని వారి అభ్యున్నతి కోసం ఉపయోగిస్తా..
- నాకు నచ్చని వారిపైన అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుణ్ణి కాదు..
- తెలంగాణ ప్రజలు నాపైన పెద్ద బాధ్యత పెట్టారు
- నా గెలుపే నా ప్రత్యర్థులకు దుఃఖం
- నేను సీఎం గా సంతకం పెట్టడం వాళ్ల గుండెలపైన గీత పెట్టినట్లు
- 109 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో జయ జయ హ్ తెలంగాణ పాట పాడించాను..ఇంత కంటే ఇంకా ఏం కావాలి?
- భవనాలు ఎవరైనా కడతారు..అద్దాల మేడలు,రంగుల గోడలు అభివృద్ధి కాదు
- పేదలు ఆత్మగౌరవం తో తలెత్తు కోవడమే అభివృద్ధి..
- 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లతో పేదలు ఆత్మగౌరవం తో బతుకనున్నారు
- రేషన్ కార్డు లు,సన్నబియ్యం తో పేదల ఆత్మగౌరవం పెంచాం
- వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా పదవిని వాడను,పేదల కోసమే పని చేస్తా
- తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా
- 2047 నాటికి తెలంగాణ ను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చడమే నా లక్ష్యం..
- ప్రపంచం లో గొప్ప రాష్ట్రం గా తెలంగాణ ను మరుస్తా