×

పార్వతీ కల్యాణం హరికథ గానం చేసిన డి. లక్ష్మీ మహేష్ భాగవతార్

పార్వతీ కల్యాణం హరికథ గానం చేసిన డి. లక్ష్మీ మహేష్ భాగవతార్

 శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం  డి. లక్ష్మీ మహేష్ భాగవతార్, కర్నూలు వారు పార్వతీ కల్యాణం హరికథ గానం చేసారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద  సాయంకాలం  హరికథ కార్యక్రమం జరిగింది.తబల సహకారాన్ని  ఆర్. అజయ్ బాబు, హార్మోనియం సహకారాన్ని బి. ఆంజనేయులు అందించారు.

 శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

24 న  సాంస్కృతిక కార్యక్రమాలు:

 డి.ఎం. ప్రభాకర్,  బృందం, శ్రీకాకుళం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పిస్తారు.

print

Post Comment

You May Have Missed