శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం ) శుక్రవారం యం. బాల సుందరం భాగవతార్, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా ‘ విరాటపర్వం’ హరికథగానం చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ హరికథాగానం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి తబల సహకారాన్ని ఎస్. ముత్యాలు, కీబోర్డు సహకారాన్ని మల్లేశ్వరరావు అందించారు.
నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
