శ్రీ స్వామీ అమ్మవార్ల స్మరణతో హంస ధ్వనులు

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు జరిగే  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడో  రోజు శుక్రవారం  శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాలలో  శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు . అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి.

 సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు.

హంస వాహనసేవ:

ఈ బ్రహ్మోత్సవాలలో  వాహనసేవలలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ నిర్వహించారు.

ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో హంస వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. 

ఈ గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కునిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేశారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.