మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బిసి మహిళా వ్యవసాయ గురుకుల కళాశాలలో  గెస్ట్ ఫ్యాకల్టీ అవకాశం

– ఆన్ లైన్ ద్వారా ఈ నెల 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి:

*కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన మహాత్మా జ్యోతిబా  ఫూలే  బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా గురుకుల  కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయడానికి రిటైర్డ్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనా సిబ్బంది నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి, కరీంనగర్ లో ప్రారంభమైన వ్యవసాయ మహిళా గురుకుల  కాలేజీల్లో పనిచేయడానికి అర్హులైన వారు తమ బయోడేటాలు  mjpadmissioncell@gmail.com కు పంపించాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 14 , 15 తేదీల్లో డెమో/ఇంటర్వ్యూ నిర్వహిస్తామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు మహాత్మా జ్యోతిబా  ఫూలే   బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల వెబ్ సైట్  http://mjptbcwreis.telangana.gov.in/ను సందర్శించాలని మల్లయ్య బట్టు సూచించారు.

print

Post Comment

You May Have Missed