శ్రీనివాస్ రెడ్డి కి శుభాకాంక్షలు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియమితులైన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డిని మీడియా అకాడమీ అధికారులు, సిబ్బంది సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో అకాడమీ చేయవలసిన కార్యక్రమాల గురించి నిశితంగా చర్చించారు. చర్చలో మీడియా అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్ వెంకటేశం, అకౌంట్స్ అధికారి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Post Comment