వర్షాకాలం ముగిసేలోగా క్షేత్రంలో కనీసం 3 వేల మొక్కలు నాటేవిధంగా కార్యక్రమం-ఈ ఓ

  శ్రీశైల దేవస్థానం:పర్యావరణ పరిరక్షణకు , క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు శ్రీశైల క్షేత్ర పరిధిలో పలుచోట్ల మరిన్ని మొక్కలు నాటుతున్నారు.

ఈ కార్యక్రమములో భాగంగా దేవస్థానం పరిధిలో పలుచోట్ల మొక్కలు నాటే కార్యక్రమము చేపట్టారు.

ఈ రోజు  సాయంకాలం విభూతిమఠం – రుద్రాక్షమఠం పరిసర ప్రాంతాలలో జరిగిన ఈ మొక్కలు నాటే కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి. మురళీ బాలకృష్ణ , ఉద్యానవన విభాగపు అధికారులు పాల్గొన్నారు.

తరువాత కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులతో కలిసి భ్రామరీపుష్పవనం, రుద్రవనం ( రుద్రాపార్కు), మల్లమ్మతోటను సందర్శించారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రాబోవు వర్షాకాలం ముగిసేలోగా క్షేత్రంలో కనీసం 3 వేల మొక్కలు నాటేవిధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ముఖ్యంగా దేవతావృక్షాలు, నీడనిచ్చే మొక్కలు, పూలచెట్లు, పలుఫలజాతులు, సుందరీకరణ మొక్కలు ఆయా ప్రదేశాలలో నాటేవిధంగా సమగ్రంగా తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. మొక్కలు నాటిన తరువాత వాటి సంరక్షణకు కూడా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

మొత్తం మొక్కలలో 30శాతం మేరకు దేవతావృక్షాలను నాటాలన్నారు. దేవతా వృక్షాలలో బిల్వం. కదంబం, రుద్రాక్ష, తెల్లమద్ది, ఉసిరి, రావి, వేప మొదలైన వృక్షాలను ఎక్కువగా నాటాలని సూచించారు.ఎక్కువగా పలు పార్కింగ్ ప్రదేశాలు, ఆరుబయలు ప్రదేశాలలో నీడనిచ్చే చెట్లను నాటాలన్నారు. వలయరహదారికి ఇరువైపులా కూడా మరిన్ని నీడనిచ్చేమొక్కలను నాటాలన్నారు.

అదేవిధంగా క్షేత్రపరిధిలోని పలు ఉద్యానవనాలలో మరిన్ని వృక్షజాతులను, పండ్ల మొక్కలను నాటాలన్నారు. ముఖ్యంగా శ్రీస్వామిఅమ్మవార్ల కైంకార్యాలకు వినియోగించే పూల మొక్కలను అధికసంఖ్యలో నాటాలన్నారు. అలాగే క్షేత్రపరిధిలో బిల్వం మొక్కలను విస్తృతంగా పెంచాలన్నారు.

ఆలయంలో మామిడితోరణాలకు వినియోగించేందుకుగాను క్షేత్రంలో వీలైనంత ఎక్కువగా మామిడిమొక్కలను కూడా నాటాలని ఆదేశించారు.

దేవస్థానం ఉద్యానవనాలలో చిన్నపిల్లలు ఆడుకునేందుకు మరిన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.

అదేవిధంగా పూర్వపురోజులలో వినియోగించే తిరగలి, రోకలి, దంపుడురోలు, రుబ్బురోలు, కవ్వం మొదలైన గృహోపకరణాల నమూనాలను రుద్రాపార్కులో ఏర్పాటు చేయాలన్నారు. దీనివలన మన పూర్వపు జీవనవిధానాలపై చిన్నపిల్లలలో అవగాహన కలుగుతుందన్నారు.

మల్లమ్మతోటలో మల్లెలు, కనకాంబరం, సుగంధాలు (లిల్లీలు) మొదలైన మరిన్ని పూల మొక్కలను పెంచాలన్నారు. అదేవిధంగా మల్లమ్మతోటలోని మల్లమ్మమండపంచుట్టూ కటాంజనం ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

కాగా ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి. మురళీ బాలకృష్ణతో పాటు ఉద్యానవన విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ జి.ఈశ్వరరెడ్డి, హార్టికల్చరర్ అధికారి ఎస్. లోకేష్, ఉద్యానవనశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

*విరాళాలు

దేవస్థానానికి ఈ రోజు  స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు రూ. 6,06,500/- ల విలువ గల విరాళాలను అందజేశారు.

ఈ మేరకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, శ్రీశైలంశాఖా మేనజర్   భగవాన్   ఒక ఆటోను , పారిశుద్ధ్య యంత్ర సామాగ్రిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావుకు అందజేశారు.

దేవస్థాన పారిశుద్ధ్య విభాగంలో వినియోగించుటకు వీటిని అందజేసినట్లుగా బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.

క్షేత్రపరిధిలో ఫాగింగు చేసేందుకుగాను రూ. 3.10 లక్షలు విలువ గల ఆపి ఎక్స్ట్రా క్లాసిక్ ఆటోను, క్యూకంపార్టుమెంట్ నందు భక్తులు వేచి వుండే గదులను శుభ్రపరిచేందుకు రూ. 1 లక్ష విలువగల సబ్బింగ్ అండ్ డైయింగ్ మిషన్ను, చెత్తాచెదారాలను, వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు రూ. 1.65 విలువగల లిట్టర్ పిక్కర్ మిషన్ను, మరియు పార్కింగ్ ప్రదేశాలనందలి మురుగునీటిని , వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు రూ. 31,500 విలువగల వ్యాక్యూమ్ క్లీనర్లను వీరు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. అందజేసిన సామాగ్రిని 

వినియోగిం అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమములో పర్యవేక్షకులు డి. రాధకృష్ణ, కె. అయ్యన్న, దేవస్థానం సిబ్బంది, ఎస్.బి.ఐ

సిబ్బంది పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *