
శ్రీశైల దేవస్థానం:వినాయకచవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 10వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు ఈ రోజు (19.09.2021)తో ముగిశాయి.
ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి జరిగింది.
ఈ ఉత్సవాలలో ప్రతిరోజు రత్నగర్భగణపతిస్వామివారికి, సాక్షిగణపతిస్వామివారికి, సాక్షిగణపతి ఆలయములో నెలకొల్పిన మృత్తికాగణపతికి వ్రతకల్పపూర్వక పూజలు, మండపారాధనలు, ఉపనిషత్ పారాయణలు,జపానుష్ఠానాలు, గణపతిహోమం, రుద్రహోమం, సాయంకాలపూజలు జరిపారు. కాగా పూర్ణాహుతి కంటే మందుగా స్వామివారి ఆలయములోని రత్నగర్భగణపతి స్వామివారికి , సాక్షిగణపతిస్వామివారికి, మృత్తికా గణపతివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజల తరువాత యాగశాలలో పంచలోహ వరసిద్ధి వినాయకస్వామివారికి కూడా విశేష పూజలు జరిగాయి.
అనంతరం లోకకల్యాణం కోసం జపాలు, నిత్యహోమ బలిహరణలను చేసి గణపతిహోమం, జయాది హోమం జరిగాయి .తరువాత పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం కార్యక్రమాలు జరిగాయి.
పూర్ణాహుతి కార్యక్రమంలో నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు,నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసారు.
తరువాత జరిగిన అవబృథంలో వరసిద్ధి వినాయకస్వామి పంచలోహమూర్తికి ఆలయ ప్రాంగణంలో గల మల్లికా గుండంలో వైదిక స్నపన కార్యక్రమం జరిగింది.
అదేవిధంగా ఉత్సవరోజులలో సాక్షిగణపతి ఆలయంలో కూడా ప్రతిరోజూ హోమాలు, జపాలు, పారాయణలు జరిగాయి.
మృత్తికా గణపతికి నిమజ్జనోత్సవం –
గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన మృత్తికా గణపతిస్వామి వారికి ఈ రోజు (19.09.2021) నిమజ్జనోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా అర్చక స్వాములు గణపతికి విశేషంగా పూజాదికాలను జరిపించారు. తరువాత లింగాలగట్టులో నిమజ్జనోత్సవం ప్రత్యేకం.