వివిధ రాష్ట్రాల్లో సేవ‌లందిస్తున్న‌ వృద్ధుల టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ‘ఎల్డర్‌లైన్’ (14567)

సాంఘిక న్యాయం:
2021 మే చివరి నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి వ‌చ్చే అవకాశం
17 MAY 2021 :ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వృద్ధుల‌ సమస్యలను పరిష్కరించడానికి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ‘ఎల్డర్‌లైన్’ ప్రాజెక్ట్ క్రింద ప్రధాన రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల వారీగా కాల్ సెంటర్లు ప్రారంభించింది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, రాజస్థాన్, త‌మిళ‌నాడు,  కర్ణాటకలోని త‌దిత‌ర‌ ప్రధాన రాష్ట్రాల్లో ఈ సౌకర్యం ఇప్పటికే పనిచేస్తోంది. తెలంగాణలో ఈ సౌకర్యం ఏడాదికి పైగా పనిచేస్తోంది. 2021 మే చివరి నాటికి అన్ని రాష్ట్రాల‌లో వాటిని క్రియాత్మకంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కాల్ సెంటర్లను టోల్ ఫ్రీ నంబర్ 14567కు ఫోన్ చేయ‌డం ద్వారా చేరుకోవచ్చు. పెద్దలందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల‌ని అధికారులు కోరుతున్నారు. ఎల్డర్‌లైన్ అనేది టాటా ట్రస్ట్‌ , ఎన్‌ఎస్ఈ ఫౌండేషన్ సౌజ‌న్యంతో పనిచేసే స‌దుపాయం.

 

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.