
శ్రీశైల దేవస్థానం:క్షేత్రపరిధిలో మరింత ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని (గ్రీనరీ) పెంపొందించేందుకు పలు చర్యలు చేపడుతున్నారు.దేవస్థానం ఉద్యానవనాలలో పలురకాల సుందరీకరణ మొక్కలు నాటుతున్నారు.
బాహ్యవలయ రహదారిలో కానుగ, రావి, మర్రి, జువ్వి, వేప, నేరేడు మొదలైన మొక్కలు నాటారు. గత వర్షాకాలంలో ఈ వలయరహదారిలో సుమారు 2వేల మొక్కలను నాటారు. రహదారి విభాగినిలలో (రోడ్డు డివైడర్స్ లో) సువర్ణగన్నేరు, భోగన్ విలియా, గన్నేరు మొదలైన పూల మొక్కలను నాటారు.
సుందరీకరణలో భాగంగా ఆలయ ప్రాంగణములో పలు రకాల మొక్కల కుండీలను ఏర్పాటు చేసారు. ఆలయ సాలుమండపాల పొడవునా, నవబ్రహ్మాలయాల ముందు, సహస్రదీపాలంకరణ మండపం ముందు భాగం, ఆమ్మవారి ఆలయం మెట్ల మార్గం తదితర చోట్ల ఈ మొక్కల కుండీలను నెలకొల్పారు. పొగడ, భోగన్ విలియా, విచ్చియామెర్లీ గ్రీన్, మొదలైన మొక్కలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసారు. అదేవిధంగా ఆలయ మహాద్వారం ముందు రెండు వైపులా కూడా పలురకాల చామంతి పూల మొక్కల కుండీలు ఏర్పాటు చేసారు.