శ్రీశైల దేవస్థానం:భక్తుల వసతి సౌకర్యార్థం కుటీర నిర్మాణం పథకం కింద దేవస్థానం నిర్మిస్తున్న గణేశ సదనములోని రెండవ అంతస్తు లో ఒకగది ( 2వ అంతస్తు బ్లాక్ – సి, డీలక్స్) నిర్మాణానికి శనివారం విరాళం అందింది.గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన జి. సాంబశివరావు ఇందుకు సంబంధించిన విరాళం మొత్తము రూ. 15,00,000/-ల చెక్కును సహాయ కమిషనర్ హెచ్.జి. వెంకటేశ్ కు అందజేశారు.ఈ సందర్భంగా దాతకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.