శ్రీశైల దేవస్థానం:దేవస్థానానికి శనివారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, శ్రీశైలం శాఖ వారు మహేంద్ర బోలేరో వాహనాన్ని విరాళంగా సమర్పించారు.
గంగాధర మండపం వద్ద ఈ మహేంద్ర బోలేరో వాహనాన్ని , సంబంధిత పత్రాలను ఆ బ్యాంకు చైర్మెన్ పి. వి. కె. ప్రమోద ్కుమార్ రెడ్డి దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుకు అందించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మెన్ మాట్లాడుతూ 11.50 లక్షలతో కొనుగోలు చేసిన మహేంద్ర బోలేరో వాహనాన్ని దేవస్థానానికి అందజేశామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముందుగా కార్యనిర్వహణాధికారి, అర్చక స్వాములు వాహన పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమములో
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ పి.వి. రమణ, శ్రీశైలం బ్రాంచ్ మేనేజరు కె. సుబ్రహ్మణ్యం, సంబంధిత బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
అదేవిధంగా శ్రీస్వామివారి ప్రధానార్చకులు శివప్రసాద్్స్వమి, దేవస్థానం పర్యవేక్షకులు డి.నాగేశ్వరరావు, దేవస్థానం ముఖ్యభద్రతా అధికారి బి.శ్రీనివాసరావు, ట్రాన్స్పోర్టు విభాగం వర్క్ ఇన్స్పెక్టర్ యం. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
