శ్రీశైల దేవస్థానం: బి. సాంబశివరావు, ప్రైమార్కు ఎంటర్ప్రైజెస్, హైదరాబాద్ , దేవస్థానానికి ఫోటో కెమెరాను అందజేశారు. కార్యనిర్వహణాధికారి ఎస్. ఎస్. చంద్రశేఖర ఆజాద్, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు, హెచ్. వీరయ్యస్వామి, సీనియర్ వేదపండితులు గంటి రాధకృష్ణ శర్మ, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు సమక్షములో ఈ కెమెరాను దేవస్థానానికి అందించారు. ఈ కెమెరా , లెన్సుల విలువ సుమారు రూ. 5,92,000/-లు దాకా ఉంటుందని దాతలు పేర్కొన్నారు.
అనంతరం దాతలకు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డుప్రసాదాలను అందించారు.
శ్రీశైల దేవస్థానానికి విరాళంగా రూ. 5,92,000/-లు విలువైన ఫోటో కెమెరా
![](https://onlinenewsdiary.com/wp-content/uploads/2024/12/e48b0ac2-f344-4893-957a-d11a27778132.jpg)