
శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం భక్తులకు ఉచిత లడ్డు ప్రసాద వితరణ ప్రారంభించారు.
నాలుగు రోజులపాటు ఈ ఉచిత లడ్డు ప్రసాద వితరణ కొనసాగుతుంది. శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునే ప్రతీ భక్తుడికి లడ్డు ప్రసాదం అందాలనే భావనతో ఈ ఉచిత ప్రసాద వితరణ చేస్తున్నారు.
ఫిబ్రవరి 10వ తేదీన శ్రీశైలంలో జరిగిన సమావేశంలో మంత్రుల బృందం మహాశివరాత్రి ఏర్పాట్లను సమీక్షించింది.
ఈ సమావేశంలో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూశాఖమంత్రి అనగాని సత్యప్రసాద్, హోం శాఖ మంత్రి శ్రీమతి వి. అనిత, రోడ్లు భవనాల, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్థనరెడ్డి, స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.
అప్పటి ఈ సమావేశంలో రాష్ట్ర దేవదాయశాఖమాత్యులు ఆనం రామానారాయణరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా పేర్కొన్నారు.ఇందులో భాగంగానే మహాశివరాత్రి పర్వదినాలలో నాలుగురోజులపాటు శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునే ప్రతీ భక్తుడికి ఉచిత లడ్డు ప్రసాదాన్ని అందజేయాలని మంత్రివర్యులు ఆదేశించారు. తదనుగుణంగా ఈ రోజు నుంచి ఉచిత లడ్డు ప్రసాద వితరణ ప్రారంభించారు.
ప్రధానాలయ పశ్చిమ ద్వారం గోపుర ద్వారా వెలుపల భాగంలో , పశ్చిమ మాడవీధిలో ప్రతీ భక్తుడికి ఈ ఉచిత లడ్డు ప్రసాదం అందిస్తున్నారు.
ఈ ప్రసాద వితరణ పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
*Distribution of biscuits and water bottles going on.