×

వినాయకుని మట్టివిగ్రహాల పంపిణీ

వినాయకుని మట్టివిగ్రహాల పంపిణీ

 శ్రీశైల దేవస్థానం:వినాయక చవితిని పురస్కరించుకుని దేవస్థానం ఉచితంగా వినాయకస్వామి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తోంది.

వినాయకస్వామిని అర్చించుకునేందుకు మట్టివిగ్రహంతో పాటు మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు, మామిడి, గన్నేరు, జమ్మి, రావి, జిల్లెడు మొదలగు పత్రాలను కూడా భక్తులకు అందిస్తున్నారు.

మన సంస్కృతీ సంప్రదాయాలపై భక్తులలో అవగాహన కల్పించేందుకు , పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేవస్థానం ఈ మట్టి విగ్రహాల ఉచిత పంపిణీని చేపట్టారు.

కాగా మన శాస్త్రాలు వినాయక చవితిరోజు మట్టితో చేసిన వినాయకుడిని పూజించాలని పేర్కొంటున్నాయి. అదేవిధంగా వినాయకచవితిరోజు మట్టితో చేసిన వినాయకుడిని పూజించడం వలన విఘ్నాలన్నీ తొలగి కార్యజయం జరుగుతుందని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  డి.పెద్దిరాజు మాట్లాడుతూ భక్తులందరు కూడా భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా వినాయకచవితిని జరుపుకోవాలని పేర్కొన్నారు. మన దేవతాగణంలో ఏ దేవీదేవతలను పూజించాలనుకున్నా ముందుగా గణపతిని పూజిస్తామన్నారు. ఈ కారణంగానే గణపతి తొలిపూజను అందుకునే దేవునిగా ప్రసిద్ధుయ్యారన్నారు.

కాగా  మట్టివిగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమములో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు హెచ్.వీరయ్యస్వామి, ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.హరిదాసు, ప్రజాసంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు కె. అయ్యన్న, కె. గిరిజామణి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed