దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోంది-ముఖ్యమంత్రి రేవంత్

వికారాబాద్​ జిల్లా పూడూర్ మండలంలో నేవీ రాడార్​ ప్రాజెక్టు పనులకు  శంకుస్థాపన చేసిన  కేంద్ర  రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, నావీ ఉన్నతాధికారులు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్  పాయింట్స్..

  • దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోంది.
  • దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్,ఎన్.ఎఫ్.సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందింది..
  • కొందరు వీఎల్ఎఫ్ ను వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
  • వీఎల్ఎఫ్ తో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
  • తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు.
  • అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు.
  • దేశంలో రెండో వీఎల్ఎఫ్ మన ప్రాంతంలో రావడం గర్వకారణం.
  • ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి.
  • వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి…
  • దేశం ఉంటేనే మనం ఉంటాం.. మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది..
  • దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల మోసం వివాదం చేసేవారికి కనువిప్పు కలగాలి.
  • 2017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి పూర్తి నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి.
  • ప్రాజెక్టును ప్రారంభించాలని రాజ్ నాథ్ సింగ్ అడగగానే మేం కొనసాగించాం.
  • దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించా..
  • పర్యావరణ ప్రేమికులకు నేను ఒకటే చెబుతున్నా…
  • దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలం…
  • దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదు..
  • ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు… దేశ రక్షణ విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్లాలి.
  • వీఎల్ఎఫ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుంది.
  • ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు  విజ్ఞప్తి చేస్తున్నా.
  • ఆలయానికి ఇబ్బందులు కలిగించొద్దని కోరుతున్నా..
  • ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరుతున్నా..
  • ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని కోరుతున్నా..
print

Post Comment

You May Have Missed