
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం మండపారాధనలు, కలశార్చనలు, జపానుష్ఠానాలు, విశేష కుంకుమార్చనలు, ఉపాంగహవనములు చండీహోమం, రుద్ర హోమం,
జయాదిహోమాలు నిర్వహించారు.పూర్ణాహుతి ఉత్సవాలలో భాగంగా శ్రీ అమ్మవారి యాగశాలలో చండీయాగ పూర్ణాహుతి, శ్రీ స్వామివారి యాగశాల లో రుద్రయాగ పూర్ణాహుతి జరిగింది. తరువాత కలశోద్వాసన కార్యక్రమాలు జరిగాయి.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాలను పూర్తి చేసారు
తరువాత మల్లికాగుండం వద్ద చండీశ్వరస్వామివారికి అవబృధ స్నానం జరిగింది.
ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి దంపతులు, కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి విజయలక్ష్మీ సుబ్బరాయుడు, మేరాజోత్ హనుమంతనాయక్, ఓ. మధుసూదన్రెడ్డి, శ్రీమతి బరుగురెడ్డి పద్మజ, డా. సి. కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, శ్రీ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక (స్థానాచార్యులు), అర్చకస్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.
శ్రీ భ్రమరాంబాదేవి అలంకారం:
దసరా మహోత్సవాల అలంకారాలలో భాగంగా ఈ సాయంత్రం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీభ్రమరాంబాదేవిస్వరూపంలో (నిజాలంకరణ) అలంకరింప జేయడం ప్రత్యేకం.అష్టభుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిఘను మొదలైన ఆయుధాలను ధరించి దర్శనమివ్వడం ప్రత్యేకం.
నందివాహనసేవ:
ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ సాయంత్రం నందివాహనసేవ కార్యక్రమం ప్రత్యేకం.ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, నందివాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు ప్రత్యేకం.
శమీ పూజ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని శమీ వృక్షానికి పూజాదికాలు ఘనం.ఈకార్యక్రమం లో భాగంగా ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనం పై శమీవృక్షము వద్దకు తోడ్కొని రావడం ప్రత్యేకం. తరువాత శమీవృక్షము వద్ద ప్రత్యేకపూజలు ప్రత్యేకం.* ఆహ్లాదంగా తెప్పోత్సవం జరిగింది.
*Visit of Justice B.V.L.N. Chakravarthy , Judge, High Court, A.P. officials received with temple honours.