హైదరాబాద్ HICC లో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ – 2025 (షీల్డ్) ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, పోలీస్ ఉన్నతాధికారులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు. సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ – 2025 (షీల్డ్) ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్.
- దేశంలోనే సైబర్ సేఫ్టీలో మన రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడమే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- డిజిటల్ సేఫ్టీ, ఫ్యూచర్ గురించి చర్చించేందుకు ఇవాళ షీల్డ్ 2025ని నిర్వహించుకుంటున్నాం.
- మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ను అభినందిస్తున్నా.
- తెలంగాణను నంబర్ వన్ సైబర్-సేఫ్ స్టేట్గా మార్చడానికి కలిసి పనిచేస్తున్న మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉంది.
- దేశంలో సైబర్ నేరగాళ్లు గత ఏడాది రూ. 22,812 కోట్లు దోచుకున్నారని ఒక అంచనా.
- ఇది మన ఆర్థిక వ్యవస్థకు, మన పౌరులకు ముప్పు.
- ఈరోజుల్లో ఫేక్ న్యూస్ అనేది మరో ప్రధానమైన ముప్పు.
- సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో సమాజంలో గందరగోళం ఏర్పడుతుంది.
- సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు… మా ప్రభుత్వం నిపుణులు, IT సంస్థలతో కలిసి పనిచేయడానికి, అన్ని రకాల వనరులు సమకూరుస్తోంది.
- మనం తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్ గా మార్చాలి.
- 1930 నంబర్ ను అందరికీ షేర్ చేయాలని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నా.. ఇది 24/7 సైబర్ హెల్ప్లైన్
- పూర్తిస్థాయిలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ బ్యూరో, పౌరులను రక్షించడానికి అంకితమైన సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.
- మేం గత ఏడాది 7 కొత్త ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాం.
- ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసిన DGP, సైబర్ బ్యూరో డైరెక్టర్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా.
- ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు TG-CSB బృందాన్ని అభినందిస్తున్నా.
- తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్ గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దాం…
- ఇది అత్యంత కీలక సదస్సు
- నేరాల విధానం వేగంగా మారుతోంది
- సమాజంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
- సైబర్ క్రైం ను నియంత్రించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉంది
- కానీ సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది
- నేరం జరిగిన తరువాత పట్టుకోవడం కాదు.. నేరం జరగకుండా నిరోధించేలా
- కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు
- ఫేక్ న్యూస్ తో పాటు ఆర్థిక నేరాలను కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది
- సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుదాం