
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా కొమ్మినేని శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొమ్మినేని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎం కు కృతజ్ఞతలు తెలియజేశారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం కొమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. ‘దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి పైకి వచ్చాను,నాపట్ల గౌరవంతో ప్రెస్ అకాడమీ ఛైర్మెన్గా బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. వైయస్ జగన్ రాజకీయాల్లో సీఎంగా, ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించారు. నాకు అప్పగించిన బాధ్యతలపట్ల చిత్తశుద్ధితో ప్రెస్ అకాడమీ అభివృద్ధికి కృషి చేస్తాను’ అని కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.