×

క్యూకాంప్లెక్స్లో అవసరమైన మరమ్మతులను ఎప్పటికప్పుడు చేయాలి-చక్రపాణి

క్యూకాంప్లెక్స్లో అవసరమైన మరమ్మతులను ఎప్పటికప్పుడు చేయాలి-చక్రపాణి

 శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆదివారం  క్యూకాంప్లెక్స్, ఆర్జితసేవా కౌంటర్లు, విరాళాల సేకరణ కేంద్రం, మొదలైనవాటిని ఇంజనీరింగ్, భద్రతా, విరాళాల సేకరణ అధికారులు కలిసి పరిశీలించారు. ఈ ఓ  మాట్లాడుతూ క్యూకాంప్లెక్స్ లో భక్తులకు ఎటువంటి ఆలస్యం లేకుండా అల్పాహారం, మంచినీరు అందిస్తుండాలని సిబ్బందికి సూచించారు. క్యూకాంప్లెక్స్లో అవసరమైన మరమ్మతులను ఎప్పటికప్పుడు చేస్తుండాలన్నారు.క్యూకాంప్లెక్స్ లోనూ, క్యూకాంప్లెక్స్ లోని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. ముఖ్యంగా అన్ని శౌచాలయాలలో కూడా నిరంతరం నీటి సరఫరా ఉండే విధముగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.క్యూ కాంప్లెక్స్ లోని మంచినీటి కుళాయిలు, వాష్ బేసిన్లకు కూడా నిరంతరం నీటి సరఫరా ఉండాలన్నారు.

తరువాత విరాళాల సేకరణ సిబ్బందితో ఈ ఓ  మాట్లాడుతూ దాతలకు దేవస్థానం నిర్వహిస్తున్న విరాళాల పథకాల గురించి వివరంగా తెలియజేస్తుండాలన్నారు. ఆలయ దర్శన వేళలు, ఆర్జిత సేవల నిర్వహణ సమయాలు మొదలైన వాటిని ఎప్పటికప్పుడు ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా వివరిస్తుండాలన్నారు.ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి.మురళీ బాలకృష్ణ, పర్యవేక్షకులు రవికుమార్, ముఖ్యభద్రతా అధికారి నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed