సీఎం పర్యటన సందర్భంగా  అధికారులు ఎవరికి కేటాయించిన విధులు వారు సక్రమంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సూచనలు*

కర్నూలు డిసెంబర్ 21:-ఈనెల 22వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి  పర్యటన సందర్భంగా అధికారులు ఎవరికి కేటాయించిన విధులు వారు సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు.

మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో  ఈ నెల 22వ తేదీ జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు  సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ , జాయింట్ కలెక్టర్( రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు , డి ఆర్ ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 22 తేదీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతున్నారన్నారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ దిగినప్పటి నుంచి  పర్యటన పూర్తయ్యే వరకు ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా అధికారులకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.