×

ఇక ” భారత్ రాష్ట్ర సమితి” -శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు ఆవిర్భావం కార్యక్రమం

ఇక ” భారత్ రాష్ట్ర సమితి” -శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు ఆవిర్భావం కార్యక్రమం

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత, సీఎం కెసిఆర్ కు అధికారికంగా లేఖ అందింది.

ఈ నేపథ్యంలో .. రేపు , డిసెంబర్ 9 న  శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు దివ్య ముహూర్త సమయాన “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బిఆర్ఎస్ అధినేత  కె చంద్రశేఖర్ రావు  నిర్ణయించారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో 9 న  ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు రిప్లై గా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపిస్తారు.

అనంతరం  కేసిఆర్  బిఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో  పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని కేసేఆర్  కోరారు.

వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత  కేసిఆర్ కోరారు.

print

Post Comment

You May Have Missed