
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం ఈశ్వరాంజనేయస్వామి భజన మండలి, కర్నూలు వారు భజన కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి భజన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఈశామహేశా, కైలాసవాస, శంకరాపార్వతీపరమేశ్వరా,
ఓంకార రూపా, నమోభూతనాథా, హరహరమహాదేవ, గంగాధరహర గౌరీమనోహర,
శ్రీకాళహస్తీశ్వరా మొదలైన పలు భక్తిగీతాలు, అష్టకాలను ప్రసాద్ శర్మ, శెట్టి వీరశేఖరప్ప, ఎస్. మహేష్, ఎస్. సుధాకర్, శివుడు, జె. పార్వతమ్మ, జె. చంద్రకళ, ప్రభావతమ్మ, లక్ష్మీదేవమ్మ, రేణుక, ఉమాదేవి, కల్యాణి, బాలస్వామి తదితరులు ఆలపించారు.