
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) బుధవారం శ్రీమారుతీ వెంకటేశ్వర భజన మండలి, గోనెగండ్ల వారు భజన కార్యక్రమం నిర్వహించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో కైలాసగిరివాసా, అమ్మాభ్రమరాంబాదేవి, నమో భూతనాథ, విఘ్నేశ్వరా, మహాదేవశంభో, శ్రీగౌరీ ఈశ్వర, హే విశ్వలింగా, అంబా పరమేశ్వరి తదితర భక్తిగీతాలను వెంకటేష్, కె. నాగేష్, రామకృష్ణ, సంజన్న, కె. ఎస్. భీరన్న, కె. పెద్దయ్య, కె. నగేష్, సంజీవరెడ్డి, రామకృష్ణ, రామకృష్ణ తదితరులు ఆలపించారు.
కార్యక్రమానికి హార్మోనిస్ట్ వి. మేఘనాథ్ ఆచారి, తబలలో జి. సర్వేశ్వరరెడ్డి సహకరించారు.అనంతరం భజన బృందం వారికి శ్రీస్వామిఅమ్మవార్ల లడ్డు ప్రసాదాలను అందించారు.
13న సాంస్కృతిక కార్యక్రమాలు:
13న వనపర్తి నరసింహా రావు బృందం, పోరుమామిళ్ళ వారు తోలు బొమ్మలాట కార్యక్రమం సమర్పిస్తారు.